News August 16, 2024
రెండేళ్లలో ప్రభుత్వం పడిపోతుంది: జగన్ మేనమామ

ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్షించారు.
Similar News
News December 6, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=
News December 6, 2025
కడప: ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలపై GST దాడులు.!

కడప జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్, ట్రావెల్ కార్యాలయాలపై శుక్రవారం జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు. CTO జ్ఞానానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో, CTO రాజనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కడపలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. పెనాల్టీ విధించారు. ప్రొద్దుటూరులో 4 ట్రాన్స్పోర్ట్, 3 ట్రావెల్ కార్యాలయాలపై దాడులు జరిగాయి.
News December 6, 2025
ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి 50 ఏళ్ల మాస్టర్ ప్లాన్

ఒంటిమిట్ట ఆలయానికి 50 ఏళ్లకు సరిపడా అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ని రూపొందించాలని TTD EO అనిల్ కుమార్ సింగల్ అధికారులను ఆదేశించారు. TTD పరిపాలన భవనంలో ఆయన ఒంటిమిట్ట అధికారులతో శ్రీ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు. భక్తుల తాకిడికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని, అందులో మ్యూజియం, ఉద్యానవనాలు, చెరువులో జాంబవంతుని 108 అడుగుల విగ్రహం వంటి అనేక అభివృద్ధి పనులపై చర్చించారు.


