News August 16, 2024

రెండేళ్లలో ప్రభుత్వం పడిపోతుంది: జగన్ మేనమామ

image

ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్షించారు.

Similar News

News December 8, 2025

రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా జట్టు ఘన విజయం

image

గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ పోటీల్లో ఈస్ట్ గోదావరిపై కడప జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. కడప 16 ఓవర్లలో 171 పరుగులు చేయగా.. ఈస్ట్ గోదావరి 145 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్ ప్రవీణ్ 41 బంతుల్లో 85 పరుగులతో వీరవిహారం చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ వెంకటయ్య, వైస్ కెప్టెన్ సుబ్బరాయుడు ప్రవీణ్‌ను అభినందించారు. క్రీడాకారులను పలువురు ప్రశంసించారు.

News December 8, 2025

కడప జిల్లాలో e-Shramలో నమోదు చేసుకున్న 3.80 లక్షల మంది

image

కడప జిల్లాకు చెందిన 3.80 లక్షల మంది శ్రామికులు తమ పేర్లను కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన e-Shram పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. 42.76% పురుషులు, 57.23% మహిళలు నమోదు చేసుకున్నారు. 18-40 వయస్సు వారు 45.2%, 40-50 వయస్సు వారు 30.27%, 50+ వయస్సు వారు 24.47% మంది చేసుకున్నారు. అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ, వ్యవసాయ, ఇతర రంగాల్లోని కార్మికులు ప్రభుత్వ పథకాల కోసం నమోదు చేసుకున్నారు.

News December 8, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం వెండి ధరలు:

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు:
☞ బంగారం 24 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.12775
☞ బంగారం 22 క్యారెట్ ఒక గ్రాము ధర: రూ.11753
☞వెండి 10 గ్రాముల ధర: రూ.1780