News July 13, 2024

రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం: కేంద్ర రైల్వేశాఖ సహయమంత్రి

image

రాబోయే రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం పనులు 2026నాటికి పూర్తిచేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హామీ ఇచ్చారు. మడకశిరలోని రాయదుర్గం-తుంకూర్ రైల్వే లైన్ అర్ధాంతరంగా ఆగిన పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఆయనను ఎంపీ
బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మంత్రిని కలిశారు.

Similar News

News November 21, 2025

అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు

image

గంజాయి సరఫరా, విక్రయాలకు పాల్పడిన ఐదుగురి ముఠాకు 10 ఏళ్లు జైలు శిక్ష, చెరో రూ.లక్ష జరిమానా విధిస్తూ అనంతపురం మొదటి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి సంచలన తీర్పు వెలువరించారు. (గంగాధర్, స్వాతి, ప్రసాద్, షేక్ గౌసియా, షేక్ అలీ) నిందితులకు శిక్ష పడేలా కృషిచేసిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ జగదీశ్ అభినందించారు. షేక్ అలీ గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామం కాగా మిగిలిన నలుగురు అనంతపురానికి చెందినవారే.

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.