News July 13, 2024

రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం: కేంద్ర రైల్వేశాఖ సహయమంత్రి

image

రాబోయే రెండేళ్లలో రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గం పనులు 2026నాటికి పూర్తిచేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న హామీ ఇచ్చారు. మడకశిరలోని రాయదుర్గం-తుంకూర్ రైల్వే లైన్ అర్ధాంతరంగా ఆగిన పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఆయనను ఎంపీ
బీకే పార్థసారథి, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మంత్రిని కలిశారు.

Similar News

News February 19, 2025

యూట్యూబర్ హత్య.. భూ వివాదమే కారణమా?

image

గుంతకల్లు మండలంలో యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కసాపురం హంద్రీనీవా కాలవలో మంగళవారం శవమై తేలారు. పోలీసుల వివరాల మేరకు.. భూ వివాదమే ఆయన హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ వివాదం నడుస్తోందని, మృతుడి భార్య కూడా అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News February 19, 2025

కళ్యాణదుర్గం కానిస్టేబుల్‌కు జిల్లా ఎస్పీ అభినందన

image

ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన కళ్యాణదుర్గం కానిస్టేబుల్ షఫీని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు. పతకాలను ప్రదానం చేయడంతో పాటు కానిస్టేబుల్‌ను సన్మానించారు. కాగా షఫీ 100 మీటర్స్ ఈవెంట్‌లో 3వ స్థానం, 200, 400 మీటర్స్‌లో ప్రథమ స్థానం, 4×100 రిలేలో 2వ స్థానం సాధించారు. మార్చి 4 నుంచి 9 వరకు బెంగుళూరులో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించారు.

News February 19, 2025

22న అనంతపురానికి మందకృష్ణ మాదిగ రాక

image

అనంతపురంలో ఈ నెల 22న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నేత చెరువు నాగరాజు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

error: Content is protected !!