News March 14, 2026
రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి: KTR

TG: మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు రెండేళ్లు తమ ఆస్తులు కాపాడుకోవాలని, తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. BRS హయాంలో చేపట్టిన మూసీ అభివృద్ధిపై HYD హిమాయత్ సాగర్ వద్ద ఆయన PPT ఇచ్చారు. రానున్న రెండేళ్లు కాంగ్రెస్ బుల్డోజర్ ప్రభుత్వంపై పోరాటానికి మూసీ బాధితులంతా తమకు అండగా ఉండాలని కోరారు. HYDలో మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
Similar News
News April 13, 2026
భద్రాద్రి కలెక్టర్తో ఎంపీ రేణుక భేటీ

ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భద్రాచలం వచ్చిన ఆమెను కలెక్టర్ అంకిత్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వీరబాబు, కొత్తగూడెం మేయర్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కమిషనర్ సుజాత కార్పొరేటర్లు స్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి జిల్లా సమస్యలు, సమగ్ర అభివృద్ధి పై చర్చించారు.
News April 13, 2026
భారత్ చేరుకున్న ఇరాన్ నౌకలు

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్ చేరుకున్నాయి. గుజరాత్లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.
News April 13, 2026
కొవిడ్ వ్యాక్సిన్.. చావు అంచుకు వెళ్లొచ్చానన్న మస్క్

జర్మనీలో సంభవించిన పది వేలకు పైగా మరణాలకు mRNA వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ వెల్లడించారు. ఈ వాదనను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సమర్థించారు. ‘టీకా డోసేజ్ కచ్చితంగా ఎక్కువగా ఉంది. దాన్ని చాలా సార్లు ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది. కానీ భయంకరంగా లేదు. అయితే రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.


