News March 21, 2024

రెండోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ MLA

image

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని రెండోసారి కలిశారు. వారు మాట్లాడుతూ.. మువ్వ విజయ్ బాబుకు రాష్ట్ర విద్యాశాఖ మౌళిక సదుపాయాల కల్పనాధికారిగా ఛైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. కలిసిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఛైర్మన్ మువ్వ విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ ఉన్నారు.

Similar News

News December 1, 2025

68 ఏళ్ల ఏకగ్రీవానికి ముగింపు.. తెల్దారుపల్లిలో ఈసారి ఎన్నికల్లేవ్

image

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైంది. దాదాపు 68 ఏళ్లుగా (1957 నుంచి) 13 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుని, కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిన ఈ గ్రామం చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనడం లేదు. తెల్దారుపల్లి ఇటీవల ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైందని అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో ఈసారి ఎన్నికల సందడి కనిపించడం లేదు.

News December 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

News November 30, 2025

ఎన్నికలు.. ప్రజావాణి తాత్కాలిక రద్దు: ఖమ్మం కలెక్టర్‌

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున, కలెక్టరేట్‌లో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి నిలిపివేయబడుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించి, సహకరించాలని ఆయన సూచించారు.