News April 24, 2024
రెండో దశ ర్యాండమైజేషన్ పూర్తి: రోనాల్డ్ రోస్

సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వెల్లడించారు. చాదర్ ఘాట్లోని విక్టరీ క్రీడా ప్రాంగణంలో తాజాగా రెండో దశ ర్యాండమైజేషన్ పూర్తయిందని, తదనంతర ప్రక్రియలో భాగంగా వాటిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా విభజించి, 15 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచినట్లు తెలిపారు.
Similar News
News February 12, 2026
HYD: ఆస్తిని లాక్కొని.. తండ్రిని గెంటేసిన కూతుర్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని కుమార్తెలే వీధిన పడేసిన అమానవీయ ఘటన మారేడుపల్లి సెకండ్ లక్ష్మీనగర్లో కలకలం రేపింది. మిథాని రిటైర్డ్ ఉద్యోగి రాజలింగం తనకున్న 130 గజాల స్థలాన్ని ఇద్దరు కుమార్తెల పేరిట రాసిచ్చారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే వారు ఆయన్ని ఇంటి నుంచి గెంటివేశారు. తిండి పెట్టకుండా బయటకు పంపడంతో బాధితుడు కుమార్తెల ఇంటి ముందే ఆందోళనకు దిగారు. ప్రస్తుతం బస్తీవాసులే ఆయనకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.
News February 12, 2026
HYD: ఆన్లైన్లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT
News February 12, 2026
HYD: ఆన్లైన్లో కీసర గుట్ట దర్శనం టికెట్లు

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని ఆలయ EO కట్టా సుధాకర్ రెడ్డి, ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా 14న స్వామివారి కళ్యాణానికి సంబంధించిన టికెట్లు, VIP దర్శనం, అభిషేకానికి సంబంధించిన టికెట్లు keesaragutta.telangana.gov.inలో పొందవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని EO సూచించారు.
SHARE IT


