News December 31, 2024

రెండో రోజు 197 మంది అభ్యర్థుల ఎంపిక

image

కర్నూలులోని ఏపీఎస్పీ రెండవ బెటాలియన్లో జరిగిన రెండో రోజు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు 197 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. ఏదైనా సమస్యలపై, ఇతర కారణాలతో అప్పీలు చేసుకున్న అభ్యర్థులు జనవరి 28న హాజరు కాగలరని తెలిపారు.

Similar News

News November 21, 2025

సర్వీస్ నుంచి కర్నూలు సీఐ శంకరయ్య డిస్మిస్

image

సీఐ జె.శంకరయ్యను పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ (తొలగింపు) చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శంకరయ్య కర్నూలు వీఆర్‌లో ఉంటూ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. శంకరయ్యను క్రమశిక్షణా చర్యలపై డిస్మిస్ చేసినట్లు ఆయన తెలిపారు.

News November 21, 2025

PMAY-G పేరు నమోదు చేసుకోండి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G 2.0) కింద గృహాల కోసం లబ్ధిదారుల పేర్ల నమోదు చేసుకోవాలని కర్నూలు కలెక్టర్ డా.సిరి సూచించారు. గ్రామ/వార్డు సచివాలయంలో పేర్ల నమోదుకు ఈ నెల 30లోపు పూర్తి చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 20, 2025

పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకూడదు: కలెక్టర్

image

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని మంజీత్ కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ & ప్రెసింగ్ యూనిట్‌లో సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆమె.. పత్తి సేకరణ, కొలతలు, రేట్లపై సమాచారం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సకాలంలో చెల్లింపులు చేయాలని సీసీఐ అధికారులను ఆదేశించారు.