News February 25, 2025

రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దు: జగ్గారెడ్డి

image

ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని కొందరు రెడ్డి సామాజిక వర్గంపై చేసిన విమర్శల్ని తప్పుగా తీసుకోవద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వాళ్ల మాటలు పట్టించుకోని పార్టీ పట్ల వ్యతిరేక భావన కలిగి ఉండవద్దన్నారు. రెడ్డి సామాజిక వర్గం ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం స్థానంలో ఉందని అందరూ ఓపిగ్గా ఉండాలని కోరారు.

Similar News

News March 24, 2025

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తాజా సమాచారం

image

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. మొత్తం 20.18 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 9.14 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే 473.03 అడుగుల వరకు నీటి నిల్వ ఉంది. కాగా 804 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, వివిధ అవసరాల ప్రాజెక్ట్ నుండి1485 క్యూసెక్కుల ని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.

News March 24, 2025

తెరపై మెరిసిన క్రికెటర్లు వీళ్లే!

image

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘రాబిన్‌హుడ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. క్రికెటర్లు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. తెరపై మెరిసిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అందులో బ్రెట్‌లీ- అన్ఇండియన్, పఠాన్ – కోబ్రా, యువరాజ్- పుట్ సరదారన్ దే, మెహందీ షగ్రా దిలలో బాలనటుడిగా, సచిన్ తన డాక్యుమెంటరీలో, కపిల్ దేవ్-83, అజయ్ జడేజా- ఖేల్, సునీల్ గవాస్కర్ – పదుల సినిమాల్లో నటించారు.

News March 24, 2025

జగిత్యాల ప్రజావాణిలో 32 ఫిర్యాదులు

image

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, మెట్ పల్లి ఆర్డిఓ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!