News March 28, 2025
రెబ్బెన: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు

రెబ్బెన మండలంలోని పైలెట్ గ్రామపంచాయతీగా ఎంపిక చేసిన పాసిగంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగినట్లుగా బీజేపీ మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ శంకరమ్మకు వినతిపత్రం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అర్హులందరికీ న్యాయం జరగకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
Similar News
News November 4, 2025
మీర్జాగూడ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణం: DGP

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని DGP శివధర్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఇవాళ ఆయన పరిశీలించారు. ‘ఇక్కడ రోడ్డు మలుపు ఉంది కానీ యాక్సిడెంట్ అయ్యేంత తీవ్ర మలుపు లేదు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయి. టిప్పర్ కండిషన్ను పరిశీలిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదు. అందరి బాధ్యతగా చూడాలి. డ్రైవర్లు డిఫెన్స్ కండిషన్ను అంచనా వేసుకోవాలి’ అని సూచించారు.
News November 4, 2025
తిరుపతి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భారీ భద్రత

కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే ఆలయాల్లో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. క్యూ లైన్ నిర్వాహణ, వచ్చి వెళ్లే మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్, దర్శనం తదితర అంశాలపై ఆయా ఆలయాల కమిటీలతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
News November 4, 2025
జూరాలకు 28 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గింది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 28 వేల క్యూసెక్కులు వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 30,287 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాలువలకు, భీమా లిఫ్ట్కు కలిపి 2,018 క్యూసెక్కుల నీటిని, మొత్తంగా 33,102 క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు.


