News April 6, 2024

రెబ్బెన: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లె పోశం తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 2న పోశంకు భార్యతో గొడవ జరగాగ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పోశం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News January 22, 2025

అర్హుల ఎంపిక కోసమే గ్రామసభ: ADB కలెక్టర్

image

అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసమే గ్రామ సభలను ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఉట్నూరు మండలంలోని ఉమ్రి గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి నూతన దరఖాస్తులు స్వీకరిస్తున్నానని తెలిపారు అర్హులైన వారు గ్రామసభలో సమర్పిస్తే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

News January 21, 2025

కడెం: కొడుకును చూడటానికి వెళ్తుండగా ACCIDENT

image

కడెం మండలం పాండ్వాపూర్ గ్రామానికి చెందిన మల్లపల్లి భూమన్న ఈనెల 19న ఉట్నూరు మండలం సాలెవాడకు తన పని ముగించుకొని కుమారుడిని చూడడానికి వెళ్తూ బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. గమనించిన స్థానికులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి పేర్కొన్నారు.

News January 21, 2025

నూతన వధువులను నాగోబాకు పరిచయం చేస్తారు

image

మెస్రం వంశస్థుల్లో నూతన వధువులను నాగోబా దేవునికి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా కుల పెద్దలు నూతన వధువులను నాగోబా దేవుని దగ్గరకు తీసుకువెళ్లి వారితో పూజ చేయించి నాగోబాకు పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కియావాల్’ అంటారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని బోడుందేవ్ జాతర పూర్తయ్యాక ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోతారు.