News March 4, 2025

రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలి: సీపీఎం

image

దేవనకొండ మండలంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై సీపీఎం నాయకుడు బీ.వీరశేఖర్ తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. తెర్నేకల్ గ్రామానికి చెందిన మాబాషా అనే రైతుకు 7 ఎకరాల వ్యవసాయ పొలంలో 27 సెంట్లు హంద్రీనీవా కాలువ కింద పోయిందని, మిగిలిన 6 ఎకరాల 63 సెంట్లు పట్టాదారు పాసు బుక్కులో ఎక్కించాల్సి ఉండగా రీ సర్వే పేరుతో ఆలస్యం చేస్తున్నారనిధ్వజమెత్తారు.

Similar News

News December 10, 2025

100 రోజులు ప్రచారం చేయండి: కలెక్టర్

image

బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే మన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఏఎస్పీ హుస్సేన్ పీరాతో కలిసి బాల్య వివాహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా 100 రోజులు నిర్విరామంగా ప్రచారాలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.