News February 21, 2025
రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్

మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండల తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. తహశీల్దార్ యాదిరెడ్డి రికార్డుల వివరాలను అదనపు కలెక్టర్కు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ రికార్డ్ రూమ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం శ్రవణ్, డిప్యూటీ తహశీల్దార్ సంయుక్త, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 6, 2025
విజయవాడ: స్కిల్ హబ్లో పనులకు టెండర్లు

తుళ్లూరులోని అమరావతి స్కిల్ హబ్లో కాంక్రీట్ బ్లాక్ల పనులు పూర్తి చేసేందుకు CRDA శనివారం టెండర్లు ఆహ్వానించింది. రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల నిమిత్తం గుత్తేదారుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నామని విజయవాడలోని CRDA కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 14లోపు ఏపీ ఈ- ప్రాక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా బిడ్లను సమర్పించవచ్చని సూచించింది.
News July 6, 2025
ఊపిరి పీల్చుకున్న జపాన్

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.
News July 6, 2025
ఎన్టీఆర్: పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ, LLM 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ANU విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.