News December 5, 2024
రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు: కలెక్టర్
జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రతిష్ఠ పెంచే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. భూ వివాదాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రెవెన్యూ సదస్సుల లక్ష్యమని అన్నారు. గురువారం ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో రెవెన్యూ సదస్సులు, మెగా పేరెంట్స్డే కార్యక్రమాల నిర్వహణపై మార్గ నిర్దేశం చేశారు.
Similar News
News January 18, 2025
నందిగామ మండలంలో దారుణ హత్య
నందిగామ మండల పరిధిలోని పల్లగిరి గ్రామ సమీపంలో సుబాబుల తోటలో షేక్ నాగుల్ మీరా అనే వ్యక్తిని కర్రలతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి స్నేహితులతో సుబాబులు తోటలో మద్యం సేవించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగినట్లుగా సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 18, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతన డీఎస్పీలు వీరే
ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూతనంగా పలువురు డీఎస్పీలకు పోస్టింగ్లు ఇస్తూ శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ సౌత్ ఏసీపీగా దేవినేని పవన్ కుమార్, గుడివాడ డీఎస్పీగా ధీరజ్ వినీల్ అవనిగడ్డ డీఎస్పీగా తాళ్లూరు విద్యశ్రీ ను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.
News January 18, 2025
కలిదిండి: మాజీ సర్పంచ్ది ప్రమాదం కాదు.. హత్య
కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం మాజీ సర్పంచ్ కాలవ నల్లయ్యది ప్రమాదం కాదని హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన బోధన శీను పథకం ప్రకారం గురువారం సాయంత్రం దాడి చేసి హతమార్చినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. హత్య కేసుగా నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.