News January 9, 2025

రెవెన్యూ సదస్సులో 4,560 అర్జీలు: కలెక్టర్

image

ప.గో.జిల్లాలో 27 రోజులు పాటు 318 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా 4,560 అర్జీలను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 8 వరకు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరిగిందన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం 45 రోజులు గడువు విధించిందని, నిర్ణీత సమయంలోగా నూరు శాతం అర్జీలను పరిష్కరిస్తామని తెలిపారు.

Similar News

News October 16, 2025

తణుకు: బీజేపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా రేణుక

image

తణుకునకు చెందిన ముళ్లపూడి రేణుక బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి నుంచి జాతీయ మీడియా ప్రతినిధిగా, రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధిగా పాలకొల్లుకు చెందిన ఉన్నమట్ల కభర్దిలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బుధవారం నియమించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు ఇరువురు నాయకులను అభినందించారు.

News October 15, 2025

పాలకొల్లు: లారీ, బైక్ ఢీ.. పురోహితుడు మృతి

image

పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో పురుహితుడు శివకోటి అప్పారావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. జిన్నూరు గ్రామానికి చెందిన అప్పారావు ఎక్సెల్ మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణిస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.

News October 15, 2025

భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

image

భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్‌కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్‌కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.