News February 14, 2025

రెవెన్యూ సదస్సుల అర్జీలను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

image

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్లో లేకుండా శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయి డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం అర్జీలను 100% ఆన్‌లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు.

Similar News

News January 7, 2026

నెల్లూరులో టాటా పవర్ అతిపెద్ద ప్లాంట్.. ₹6,675 కోట్ల పెట్టుబడులు!

image

AP: నెల్లూరులో టాటా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ(TPREL) ₹6,675 కోట్లతో 10GW సామర్థ్యంతో ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంగాట్, వేఫర్ తయారీ సెంటర్‌గా నిలవనుంది. సెమీకండక్టర్ చిప్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిలో ఈ మెటీరియల్స్ చాలా కీలకం. ఈ సంస్థ రాకతో ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.

News January 7, 2026

NLR: బధిర విద్యార్థులకు ఆడియో మీటర్

image

సూళ్లూరుపేటకు చెందిన ఎన్ఆర్ఐ యస్వంత్ బధిర విద్యార్థుల కోసం ఆడియో మీటర్ అందజేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బధిరుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు రూ.82 వేల విలువైన దీనిని సమకూర్చారు. దీనికి నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేశారు. యశ్వంత్‌ను కలెక్టర్ అభినందించారు.

News January 7, 2026

ఈనెల 8,9వ తేదీల్లో kmcలో కాకతీయ రీసెర్చ్ డే

image

ఈ నెల 8,9వ తేదీల్లో kmc లో కాకతీయ రీసెర్చ్ డే (క్రితి) నిర్వహించనున్నట్లు యూఎస్ఏ కాకతీయ అలూమినీ నిర్వాహకులు డా.వేణుబత్తిని,kmc ప్రిన్సిపల్ డా.సంధ్య తెలిపారు. బుధవారం కేఎంసి ఎన్నారై ఆడిటోరియంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న UG, పీజీ వైద్య విద్యార్థుల్లో పరిశోధన, నవీన ఆలోచనలు ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.