News February 14, 2025
రెవెన్యూ సదస్సుల అర్జీలను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్లో లేకుండా శనివారం సాయంత్రానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ మండల స్థాయి డివిజన్ స్థాయిలో ప్రతి సోమవారం అర్జీలను 100% ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రామ, మండల స్థాయి అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు.
Similar News
News November 20, 2025
పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు: కలెక్టర్

పేదల ఆకలిని తీర్చేందుకే ప్రభుత్వం అన్న క్యాంటీన్లను నిర్వహిస్తుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా తెలిపారు. పటమట హైస్కూల్ రోడ్డులోని అన్న క్యాంటీన్ ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ.5 చెల్లించి, అక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఆయన అల్పాహారం స్వీకరించారు. ఆహారం పదార్థాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. డైనింగ్ ఏరియా, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాల పట్టిక, తాగునీటిని సరఫరాను చేశారు.
News November 20, 2025
MBNR: బీఈడీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలి

పాలమూరు విశ్వవిద్యాలయంకు అనుబంధంగా ఉన్న బీఎడ్ కళాశాలల నాలుగో సెమిస్టర్ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. గురువారం పీయూ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రవీణకు వినతిపత్రం అందజేశారు. ఫలితాలు విడుదల కాకపోవడంతో ఎంఈడీ కోర్సులు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని, వెంటనే విడుదల చేయాలని కోరారు. ఫలితాలు విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
News November 20, 2025
నటి మృతి.. అసలేం జరిగింది?

నటి ప్రత్యూష మృతి కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తాను నిర్దోషినని ఆమె ప్రియుడు సిద్ధార్థరెడ్డి.. నిందితుడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును SC రిజర్వ్ చేసింది. ఇంటర్లో ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థ్ 2002 FEB 23న విషం తాగారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా సిద్ధార్థ్ కోలుకున్నాడు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేలా అతడే ఉసిగొల్పాడంటూ ప్రత్యూష తల్లి కోర్టుకెళ్లారు.


