News March 25, 2025

రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లో వాటర్ షెడ్ యాత్ర

image

రేగొండ, పలిమెల, మల్హర్ మండలాల్లోని మండలానికి రెండు గ్రామాల చొప్పున వాటర్ షెడ్ యాత్రను నిర్వహించనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నీటి పరిరక్షణ, సాగునీటి వనరుల పునరుద్ధరణ లక్ష్యంగా ‘వాటర్ షెడ్ యాత్ర’ చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. నీటి నిల్వలను మెరుగుపరచడం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, రైతులకు నీటి సదుపాయం అందించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Similar News

News December 30, 2025

భూపాలపల్లి: జాగ్రత్త.. పులి మళ్లీ వచ్చే అవకాశం!

image

జిల్లాలోని గోరికొత్తపల్లి మండలం కోనరావుపేట మీదుగా పులి సంచరించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొనరావుపేట మీదుగా ములుగు జిల్లా అబ్బాపురం, జాకారం, పందికుంట, మల్లంపల్లి ద్వారా పాకాల అటవీ ప్రాంతానికి పెద్దపులి వెళ్లినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మళ్లీ తిరిగే వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అడవికి పోవద్దని ములుగు, భూపాలపల్లి జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు.

News December 30, 2025

తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది: DGP

image

TG: పోలీస్ వార్షిక నివేదిక-2025ను DGP శివధర్‌రెడ్డి విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే క్రైమ్‌రేట్‌ 2.33% తగ్గిందని వెల్లడించారు. 2025లో 782 హత్యలు జరిగాయని తెలిపారు. పోలీసులు సేవాభావంతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఈ ఏడాది 509మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా అల్లర్లు లేకుండా నిర్వహించామని, జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, మెస్సీ పర్యటన విజయవంతమయ్యాయని వివరించారు.

News December 30, 2025

బీపీ తగ్గాలంటే ఇలా చేయండి

image

హైబీపీ ఉండటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. గుండెపోటు, స్ట్రోక్, ఇత‌ర గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే బీపీని అదుపులో ఉంచుకోవడం చాలాముఖ్యం. దీనికోసం అరటిపళ్లు, పాలకూర, సాల్మన్ ఫిష్, వెల్లుల్లి తినాలి. గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలల్లోని మెగ్నీషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఆహారంతో పాటు జీవ‌న శైలిలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామాన్ని దిన‌చ‌ర్య‌లో భాగంగా చేసుకోవాలి.