News April 13, 2025
రేగొండ: విద్యుత్ షాక్తో మహిళ మృతి

రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పనులు చేస్తూ కిటికీ ఊచలను పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లే విద్యుత్ తీగలు కిటికికీ తాకడంతో కిటికీని పట్టుకున్న నీలమ్మకు షాక్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 28, 2025
సనత్నగర్: పదో అంతస్తు నుంచి పడి బీటెక్ విద్యార్థిని మృతి

సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పతరువు రెసిడెన్సీ అపార్ట్మెంట్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి మృతి చెందింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 28, 2025
సదరం రీ-అసెస్మెంట్ జాప్యంపై కలెక్టర్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలో NTR భరోసా పింఛన్ రీ-అసెస్మెంట్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సదరం రీ-అసెస్మెంట్ కార్యక్రమంపై ఆయన శుక్రవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-అసెస్మెంట్లో జాప్యం జరుగుతుండటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 28, 2025
ఖమ్మం: సీపీఐ శతాబ్ది ఉత్సవాలు జనవరి 18కి వాయిదా

ఖమ్మం నగరంలోని ప్రసాద్ భవన్లో శుక్రవారం సీపీఐ నాయకుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు భాగం హేమంతరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరగాల్సిన సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జనవరి 18కి వాయిదా వేసినట్లు వారు తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జనవరి 18న జరిగే జయంతి ఉత్సవాలకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.


