News January 27, 2025
రేగోడ్: గజ్వాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రేగోడ్ మండలం గజ్వాడలో ఆదివారం ప్రజాపాలన గ్రామసభలో ఆర్.ఇటిక్యాలకు చెందిన ఇద్దరి లబ్ధిదారులకు రూ.1.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పీసీసీ అధ్యక్షుడు మున్నూరు కిషన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిగంబర్ రావు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వినీల వీరప్ప, నాయకులు ఈశ్వరప్ప, జ్ఞానేశ్వర్, లక్ష్మణ్, హనుమప్ప, నర్సింలు పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
మెదక్: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

నర్సాపూర్ మండలం ఎర్రకుంట తండాలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈనెల ఒకటో తేదీన శ్రీను ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడగా, కేసు నమోదు చేసిన పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు బాధితుడి అన్న కొడుకు మూడవ అంజ్యాను అరెస్టు చేసి అతని నుంచి రూ.2.60లక్షల నగదుతో పాటు వెండి పట్టగొలుసులను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి తెలిపారు.
News February 13, 2025
ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం

మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో నూతనంగా నియమితులైన పోలీస్ సిబ్బందికి రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మహేందర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఈఐఆర్, ఐఆర్ఏడి సైబర్ అవేర్నెస్, ఈ ఛానల్ పై వారికి శిక్షణ ఇచ్చారు.
News February 13, 2025
MDK: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.