News November 27, 2024
రేణిగుంటకు చేరుకున్న CM చంద్రబాబు

సీఎం చంద్రబాబు కొద్దిసేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నారావారిపల్లెలో ఆయన సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో పాల్గొనడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ ఈవో శ్యామల రావు ఆయనకు స్వాగతం పలికారు. బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు.
Similar News
News October 15, 2025
కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం

కుప్పం (M) నూలుకుంట గ్రామంలో క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. మురుగప్ప ఆచారి ఇంటి గడప ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గేసి అందులో పసుపు కుంకుమతో పాటు నిమ్మకాయలు, కోడిగుడ్డు, తమలపాకులు, అగరవత్తులు పెట్టి పూజలు చేశారు. దీంతో మురుగప్ప కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
News October 15, 2025
చిత్తూరు: పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్, జిల్లా పర్యాటక మండల చైర్మన్ సుమిత్ కుమార్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. కైగల్ జలపాతం, పులిగుండు, కంగుంది ప్రాంతాలతో పాటు మొగిలి దేవాలయాలలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఐరాల బుగ్గ మడుగు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, పర్యాటకశాఖ ఆర్డి రమణ పాల్గొన్నారు.
News October 15, 2025
కుప్పం RTC డిపో కోసం 15.37 ఎకరాలు

కుప్పం RTC డిపో ఏర్పాటుకు ప్రభుత్వం 15.37 ఎకరాలను కేటాయించింది. కుప్పం మున్సిపాలిటీ కమతమూరు రెవెన్యూ పరిధిలో 3.53 ఎకరాలు, గుట్టపల్లి రెవిన్యూ పరిధిలో 11.84 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన భూమిని మంగళవారం DPTO రాము, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం కుప్పం ఆర్టీసీ డిపో బస్టాండ్ ఓకే చోటు ఉండగా ఆధునిక వసతులతో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు డిపోను ఏర్పాటు చేయనున్నారు.