News April 13, 2025
రేణిగుంటలో గాల్లోనే విమానం..!

రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానం ల్యాండింగ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రాత్రి 8:40కి ఇండిగో విమానం చేరుకుంది. ఈదురు గాలులతో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్పోర్ట్ నుంచి ల్యాండింగ్కు క్లియరెన్స్ రాలేదు. దాదాపు అరగంట పాటు ఆకాశంలోనే విమానం చక్కర్లు కొట్టింది. గాలుల తీవ్రత తగ్గకపోవడంతో ఆ విమానాన్ని చెన్నైకి మళ్లించి అక్కడ ల్యాండ్ చేశారు.
Similar News
News November 11, 2025
TTDకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా

తిరుమలకు రూ.251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని 2022-24 మధ్య భోలేబాబా డెయిరీ సరఫరా చేసినట్టు A16 అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్లో CBI SIT పొందుపరిచింది. ఇందులో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల కల్తీ నెయ్యిని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా తరలించారని సిట్ పేర్కొంది.
News November 11, 2025
తుళ్లూరు: కారుణ్య మరణం పిటిషన్పై హైకోర్టు సీరియస్

తమ భూమిని తిరిగి అప్పగించకలేకపోతే కారుణ్య మరణానికి అనుమతించాలని తుళ్ళూరు(M) రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె, మనవరాలు పిటిషన్ వేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ తరహా అభ్యర్థనలు అనుమతించబోమని తెలుసు కదా అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిపై ఆగ్రహించింది. ప్రచారం కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దంది. కాగా CRDAకు అప్పగించిన తమ 5 సెంట్ల భూమిని అప్పగించాలని వారు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.
News November 11, 2025
ఏపీ అప్డేట్స్

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ


