News February 23, 2025
రేణిగుంట: ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

తిరుపతి పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఆప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించారు. చంద్రగిరి అభివృద్ధిపై ఆరా తీశారు.
Similar News
News November 20, 2025
ఇంటర్నేషనల్ న్యూస్ రౌండప్

☛ 16 ఏళ్లలోపు టీనేజర్లు సోషల్మీడియా వాడకూడదనే నిబంధన ఆస్ట్రేలియాలో డిసెంబర్ 10 నుంచి అమలులోకి రానుంది. ఆ టీనేజర్ల అకౌంట్లను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయనుంది.
☛ ఇండోనేషియాలోని సీరమ్ ఐలాండ్లో 6.0 తీవ్రతతో భూమి కంపించినట్లు సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది.
☛ చెక్ రిపబ్లిక్ సౌత్ ప్రాగ్కు 132 కి.మీ దూరంలో 2 ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా, 40 మంది స్వల్పంగా గాయపడ్డారు.
News November 20, 2025
ప్రకాశం: రేషన్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాలో 1392 రేషన్ షాపుల ద్వారా 651820 రేషన్ కార్డుదారులకు రేషన్ అందుతోంది. ఇటీవల జిల్లాలో ప్రభుత్వం స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రారంభించింది. అయితే సచివాలయ సిబ్బంది, డీలర్లు ఇప్పటివరకు 592800 స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 59020 కార్డులను లబ్ధిదారులు తీసుకోవాల్సిఉంది. ఈనెల 30లోగా కార్డులను స్వీకరించకుంటే, వెనక్కుపంపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 20, 2025
ANU దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం పరిధిలో జులై, ఆగస్టులో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను కేంద్రం డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ రామచంద్రన్ గురువారం విడుదల చేశారు. పీజీ కోర్సులకు రీవాల్యుయేషన్కు ప్రతి పేపర్కు రూ. 960 చొప్పున ఈ నెల 29లోగా ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు.


