News January 5, 2025

రేపటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు: కలెక్టర్ ప్రశాంతి

image

తూర్పు గోదావరి జిల్లాలో 0-6 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన పిల్లలకి ఆధార్ నమోదు కార్యక్రమానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం తెలిపారు. జిల్లాలో సుమారు 17,000 మంది పిల్లలు వివిధ కారణాలవల్ల ఆధార్ సంఖ్య లేని వారు ఉండే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందన్నారు. సోమవారం నుంచి 10వ తేదీ వరకు 0-6 మధ్య వయసు ఉన్న పిల్లలకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు.

Similar News

News September 18, 2025

పెద్దవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ కీర్తి చేకూరి పర్యటన

image

ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో పశువుల చికిత్సలకు ప్రత్యేక వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం తాళ్లపూడి మండలం పెద్దేవం, ఐ.పంగిడీ గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. గేదెల వ్యాధి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

News September 18, 2025

కలెక్టర్‌ను కలిసిన రాజమహేంద్రవరం జైల్ సూపరింటెండెంట్

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన కీర్తి చేకూరిను గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్‌లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జైళ్లలో పరిస్థితిని ఆమెకు వివరించారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ది పథంలో నడపాలని కలెక్టర్ అన్నారు.

News September 18, 2025

నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసిన రుడా ఛైర్మన్

image

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరిని గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టరేట్‌లో గురువారం ఆమెను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా పరిధిలోని అంశాలను, పలు సమస్యలను ఆమెకు వివరించారు. రుడా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.