News February 18, 2025
రేపటి నుంచి శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

NGKL మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల దర్శనానికి వెళ్లే భక్తులకు 24 గంటల అనుమతి ఉందని డీఎఫ్ఓ అబ్దుల్ రావూఫ్ పేర్కొన్నారు. రేపటి నుంచి మార్చి 1 వరకు చెక్ పోస్ట్ 24 గంటలు తెరిచి ఉంటుందన్నారు. గతంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వన్యప్రాణుల సంరక్షణార్థం చెక్ పోస్ట్ మూసి ఉండేదని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి సీసాలు నిర్దేశించిన ప్రాంతంలో వేయాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.
Similar News
News March 23, 2025
అమ్రాబాద్: సహాయక చర్యలకు రూ.5 కోట్లు

దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద సహాయ చర్యలకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ నిధులను నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ విత్ డ్రా చేసి ఖర్చుపెట్టి అధికారాన్ని కల్పించారు. గత 28 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ కలెక్టర్ అక్కడే ఉంటూ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.
News March 23, 2025
నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్పల్లె, మదన్పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 23, 2025
GNT: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. దీంతో రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.