News February 18, 2025
రేపటి నుంచి శ్రీశైలానికి 24 గంటలూ అనుమతి

NGKL మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల దర్శనానికి వెళ్లే భక్తులకు 24 గంటల అనుమతి ఉందని డీఎఫ్ఓ అబ్దుల్ రావూఫ్ పేర్కొన్నారు. రేపటి నుంచి మార్చి 1 వరకు చెక్ పోస్ట్ 24 గంటలు తెరిచి ఉంటుందన్నారు. గతంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వన్యప్రాణుల సంరక్షణార్థం చెక్ పోస్ట్ మూసి ఉండేదని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటి సీసాలు నిర్దేశించిన ప్రాంతంలో వేయాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.
Similar News
News April 17, 2026
ఖమ్మం: భానుడి భగభగ.. మూగజీవాల విలవిల

ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 42 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనంతో పాటు మూగజీవాలు అల్లాడుతున్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు అడవుల్లో నీరు దొరక్క మైదాన ప్రాంతాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. అటవీ విస్తీర్ణం తగ్గడం, మట్టి తవ్వకాలు పెరగడంతో దుప్పులు, అడవి పందులు, కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
News April 17, 2026
ఉమ్మడి వరంగల్లో నియోజకవర్గాల పెంపుపై చర్చ!

ఉమ్మడి జిల్లాలో జనాభా ఆధారంగా అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనున్నట్లు చర్చ సాగుతోంది. HNKలో 2 నుంచి 5, WGLలో 3 నుంచి 4, MHBDలో 2 నుంచి 4, BHPLలో 1 నుంచి 2 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. జనగామలో సరిహద్దుల మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. MLG యధాతథంగా కొనసాగనుంది. మొత్తం కొత్తగా 7 అసెంబ్లీ స్థానాలు పెరగడంతో పాటు మరో లోక్సభ స్థానం కూడా ఓరుగల్లుకు వచ్చే అవకాశముంది.
News April 17, 2026
శ్రీ సత్యసాయి: నలుగురి మృతికి కారణమైన వారిపై పెట్టిన కేసు ఇదే..!

కదిరి(M) కుమ్మరవాండ్ల పల్లిలో బుధవారం ఓ ఇంట్లో జరిగిన విస్ఫోటం ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెందిన వెంకన్న అద్దెకు ఉంటున్న ఇంట్లో జిలెటిన్ స్టిక్స్ అక్రమంగా నిల్వ ఉంచగా.. గ్యాస్ లీకై అవి పేలినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నలుగురి మృతికి కారణమైన వెంకన్న, అతని కొడుకుపై IPC 304 (BNS 105) కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే కోణంలో విచారిస్తున్నారు.


