News March 3, 2025
రేపటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ

జిల్లాలో డీఎస్సీ- 2024కి ఎంపికైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు మెదక్లో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. 108 మంది ఉపాధ్యాయులు మెదక్లో జరిగే శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారు. 11 అంశాలపై ఆర్పీలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

▸సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా ట్రైలర్ను రేపు విడుదల చేయనున్న మహేశ్ బాబు
▸వెట్రిమారన్, శింబు కాంబోలో వస్తోన్న ‘అరసన్'(తెలుగులో సామ్రాజ్యం) సినిమా ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్న Jr.NTR
▸విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం?
▸ మెటా AIకి దీపికా పదుకొణె వాయిస్.. తొలి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు
News October 16, 2025
MNCL: ఓటర్ కార్డు దరఖాస్తులను పరిష్కరించాలి

రాష్ట్రంలో నూతన ఓటర్ కార్డులు ఓటర్ జాబితా సంబంధిత దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. హైదరాబాదు నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో 100 వయసు పైబడిన ఓటర్లను గుర్తించాలని, వారి వివరాలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు.
News October 16, 2025
ఖమ్మం: ‘వైద్య పరీక్షలకు బయటకు పంపితే కఠిన చర్యలు’

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో నెలకు కనీసం 200 ప్రసవాలు, ఓపీ కేసుల్లో 60% పరీక్షలు చేయాలన్నారు. వైద్య పరీక్షల కోసం రోగులను బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అవసరమైన పరికరాల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని ఆదేశించారు.