News May 4, 2024
రేపల్లె చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపల్లె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్ బొకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. పవన్ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు హెలిప్యాడ్ వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఆయన రేపల్లెలో జరగనున్న సభా ప్రాంగణం వద్దకు బయలుదేరారు.
Similar News
News September 30, 2024
గుంటూరులో యువకుడిపై కత్తితో దాడి
గుంటూరులో ఆదివారం రాత్రి ఓ యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాలు.. RTCకాలనీకి చెందిన ఖాసీం మందులు కొనడానికి రాత్రి రామిరెడ్డి తోటలోని ఓ మెడికల్ షాప్కు వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి మద్యం తాగి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఖాసీంతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న చిన్న కత్తితో ఖాసీం దాడి చేశాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం GGHకు తరలించారు.
News September 30, 2024
ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల
మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తెనాలి రామలింగేశ్వరపేటలోని జనసేన నాయకులు హరిదాసు గౌరీ శంకర్ స్వగృహంలో 8,9,10,11,12 ,13 వార్డులలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వార్డులలో తిరిగి ప్రజల వద్ద నుంచి అడిగి సమస్యలు తెలుసుకొని వారి సమస్య తీర్చే విధంగా కృషి చేస్తానని ఈ మేరకు మంత్రి హామీ ఇచ్చారు.
News September 30, 2024
గుంటూరు జిల్లా TODAY TOP NEWS
⁍ గుంటూరు: TDP MLC అభ్యర్థి ఖరారు.?
⁍ గుంటూరు: ప్రేమ వ్యవహారం.. యువకుడి సూసైడ్
⁍ గుంటూరు: ANUలో విద్యార్థుల మధ్య ఘర్షణ
⁍ హోంమంత్రి అనిత డిక్లరేషన్ ఇచ్చారా.?: అంబటి
⁍ పల్నాడు: రైలులో భారీ చోరీ
⁍ మంగళగిరి: ‘సనాతన ధర్మాన్ని జగన్ అపవిత్రం చేశారు’