News September 4, 2024
రేపు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాలు

రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు కృష్ణా జిల్లాలోనూ అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
Similar News
News January 8, 2026
కృష్ణా: ఫాస్ట్ ఫుడ్ వీడి.. చిరుధాన్యాల వైపు జనం మొగ్గు.!

మెట్రో నగరాలకే పరిమితమైన ‘మిల్లెట్స్’ ట్రెండ్ ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించింది. ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో ప్రజలు ఫాస్ట్ ఫుడ్ కంటే పౌష్టికాహారానికే మొగ్గు చూపుతున్నారు. మచిలీపట్నం, గుడివాడ, పెడన తదితర ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా చిరుధాన్యాల మొలకలు, మిల్లెట్ టిఫిన్లు, ఫ్రూట్ సలాడ్స్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. బస్టాండ్లు, పార్కులు, వాకింగ్ ట్రాక్ల వద్ద ఉదయం ఈ స్టాళ్ల వద్ద రద్దీ పెరిగింది.
News January 7, 2026
ఆత్కూరులో ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ట్యాలీ కోర్సులో శిక్షణ ప్రారంభం కానుంది. శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతితో పాటు పౌష్టికాహారాన్ని ట్రస్టు నిర్వాహకులు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 6, 2026
ఎరువుల వినియోగంపై అవగాహన అవసరం: కలెక్టర్

ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు ఎరువులను విచక్షణతో వినియోగించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డీ.కే. బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన ధర్తీ మాత బచావో నిగ్రాన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు అనవసరంగా రసాయన ఎరువులు వాడకుండా నియంత్రించే బాధ్యత వ్యవసాయ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందని తెలిపారు.


