News August 4, 2024
రేపు కడపలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు రేపు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు 08562- 244437 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. SHARE IT
Similar News
News December 9, 2025
కడప మేయర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ

కడప నగర మేయర్ ఎన్నికకు సంబంధించి ఈనెల 11వ తేదీన ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఈ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వం ఈ ఎన్నికను సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఎన్నిక చల్లదంటూ వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఎన్నిక నిర్వహణపై ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు ఈ ఎన్నిక నిర్వహణపై తీర్పును రేపు ఉదయానికి వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చింది.
News December 9, 2025
కడప జిల్లా SP కీలక సూచన.!

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.
News December 9, 2025
వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా: లింగారెడ్డి

వైసీపీ హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో టీటీడీ నెయ్యి సరఫరాలో నిబంధనలు సడలించారన్నారు. వేల కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనికిలో లేని కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. టీటీడీ పవిత్రత, భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారన్నారు.


