News September 26, 2024
రేపు కనిగిరిలో ‘మెగా జాబ్ మేళా’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్ ఆధ్వర్యంలో శుక్రవారం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. 20 కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 20, 2025
ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
News December 20, 2025
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే టాక్.!

ప్రకాశం పాలి’ ట్రిక్స్’లో ఎప్పుడు ఏ ప్రచారం జరుగుతుందో ఊహించడం కష్టమే. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో రోజుకొక ప్రచారం సాగుతోంది. ఇటీవల బాలినేని గురించి ప్రకాశంలో తీవ్ర చర్చ సాగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ప్రచారం ఉండగా, అంతకు ముందు బాలినేనికి MLC పదవి వరించనుందని టాక్. ఇదే ప్రచారం బాలినేని జనసేనలోకి వెళ్లిన సమయంలోనూ సాగడం విశేషం.
News December 20, 2025
టంగుటూరులో హత్యకు కారణం అదేనా..?

టంగుటూరులోని HDFCలో సెక్యూరిటీ గార్డ్ రమణయ్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. డబ్బు కోసమే హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సింగరాయకొండ సీఐ హజరత్తయ్య పర్యవేక్షణలో పోలీసులు హత్య కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. కాగా పోలీసులు పూర్తి వివరాలు వెళ్లడించాల్సి ఉంది.


