News January 8, 2025

రేపు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన

image

పాణ్యం మండలంలోని పిన్నాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించనున్నారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాఫ్టర్‌లో కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, పిన్నాపురంలోని గ్రీన్ సోలార్ పార్కును, పంపింగ్ స్టోరేజ్ ప్రాజెక్టును పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం పవర్ హౌస్‌ను సందర్శిస్తారని తెలిపారు.

Similar News

News January 16, 2025

బేతంచర్లలో పేడ రంగు తాగి మహిళ ఆత్మహత్య

image

ఇంటి ముందు కల్లాపు చల్లుకునే పేడ రంగు తాగి మహిళ మృతి చెందిన ఘటన బేతంచెర్ల మండలం పెండేకల్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొట్టాల మహేశ్వరి(22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో పేడ రంగును నీటిలో కలుపుకొని తాగింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న మహేశ్వరిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బంధువులు వాపోయారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లెకు తరలించి కేసు నమోదు చేశారు.

News January 16, 2025

ఉపాధి వేతన దారులకు పనులు కల్పించండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామపంచాయతీలో ప్రతిరోజు వంద మంది ఉపాధి వేతనదారులకు పనులు కల్పించి నిర్దేశించిన లేబర్ బడ్జెట్ మొబిలైజేషన్ లక్ష్యాన్ని సాధించాలని అధికారులను కలెక్టర్ జీ.రాజకుమారి ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, హౌసింగ్ మ్యాండేస్, సచివాలయ సర్వీసులపై సమీక్షించారు.

News January 16, 2025

ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఆదోని ఎమ్మెల్యే!

image

ఏపీ బీజేపీకి త్వరలో కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. సుమారు 20మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఆదోని MLA పార్థసారథి సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ సీనియర్, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులతో సమావేశమైనట్లు సమాచారం. ఈ నెల 19న విజయవాడలో నిర్వహించే సమావేశంలో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.