News January 26, 2025

రేపు కలెక్టరేట్లో ప్రజావాణి: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ప్రజావాణికి హాజరయ్యే ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అందజేయాలని చెప్పారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

Similar News

News December 9, 2025

కాకినాడ: మల్లీశ్వరి.. క్షమించమ్మా..!

image

KKD జీజీహెచ్‌లో ఇటీవల 8 నెలల గర్భిణి మల్లీశ్వరి మృతి చెందిన ఘటన అందరినీ కలచివేసింది. నేడు ‘ప్రపంచ రోగి భద్రతా దినం’ సందర్భంగా వైద్యసేవల్లో మరింత అప్రమత్తత అవసరమని ఈ విషాదం గుర్తుచేస్తోంది. మాతాశిశు విభాగంలో పర్యవేక్షణ బలపడాలని ప్రజలు కోరతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోగులకు భరోసా కల్పించేలా వైద్య యంత్రాంగం చర్యలు చేపట్టి ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు.

News December 9, 2025

విశాఖలో 08 విమానాల రద్దు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

image

విశాఖ నుంచి 08 ఇండిగో ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయని విశాఖ ఎయిర్పోర్ట్ ఇన్చార్జ్ డైరెక్టర్ పురుషోత్తం మంగళవారం తెలిపారు. 217 – 218 BLRVTZBLR STD 07:45
2. 581 – 881 MAAVTZMAA STD 12:15
3. xxld – 6645 VTZHYD STD 12:45
4. xxld -6408 HYDVTZ
5. 208 – 783 HYDVTZHYD STD 16:00
6. 512 – 617 CCUVTZCCU STD 20:30
7. 6679 – 6680 DELVTZDEL STD 21:15
8. 6285 – 6286 HYDVTZHYD STD 22:50

News December 9, 2025

టీ20ల్లో మనదే డామినేషన్.. కానీ!

image

టీ20ల్లో ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 T20 మ్యాచులు జరగగా భారత్ 18, SA 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. అయితే సొంతగడ్డపై ఆడిన 12 మ్యాచుల్లో ఇండియా ఐదింట్లో నెగ్గగా దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కాగా కటక్‌లో ఆడిన రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించడం గమనార్హం.