News March 9, 2025

రేపు కాకినాడలో పీజీఆర్ఎస్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జిల్లా స్థాయిలో ఈ నెల 10న కాకినాడ కలెక్టరేట్‌లో ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

Similar News

News March 26, 2025

ప్రభాస్ అలా చేస్తే ‘కన్నప్ప’ చేసేవాడిని కాదు: మంచు విష్ణు

image

కన్నప్ప సినిమా తీసే సమయంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదని హీరో మంచు విష్ణు చెప్పారు. అయితే శివలింగాన్ని తాకే సీన్లు చిత్రీకరించే సమయంలో నేలపై పడుకున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ సినిమాను ప్రభాస్ చేస్తానని చెబితే తాను కన్నప్పను చేసేవాడిని కాదని పేర్కొన్నారు. సినిమాలో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కన్నప్ప నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు.

News March 26, 2025

పుట్టపర్తిలో జాయింట్ కలెక్టర్‌ను కలిసిన ఉషశ్రీ చరణ్

image

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌ను సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ కలిశారు. జిల్లాలో జరగనున్న ఎంపీపీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె వినతి పత్రం అందించారు. ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ZPTC పాలే జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

News March 26, 2025

డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి పనిచేస్తున్నాం: కలెక్టర్

image

పార్వతీపురం మ‌న్యం జిల్లాను డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి ప్రణాళికాబ‌ద్దంగా ప‌నిచేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.శ్యామ్ ప్ర‌సాద్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. 2వ రోజు జరిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో బుధవారం ఆయ‌న జిల్లా ప్ర‌గ‌తిపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో గిరిజ‌నలు ఎక్కువ‌గా ఉన్నార‌ని,కొండ ప్రాంతాల్లో ర‌హ‌దారి స‌దుపాయం లేక డోలీలు ఉప‌యోగిస్తున్నార‌ని అన్నారు.

error: Content is protected !!