News February 19, 2025
రేపు కాగజ్ నగర్కు మంత్రి సీతక్క

రేపు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాగజ్నగర్లో పర్యటిస్తారని ఎమ్మెల్సీ దండే విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని, ఈ సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని అన్నారు.
Similar News
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

వాట్సాప్లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.
News November 18, 2025
అన్నదాతా సుఖీభవ – అర్హతను ఎలా చెక్ చేసుకోవాలి?

వాట్సాప్లో మనమిత్ర నంబర్ 9552300009కు ‘‘Hi’’ అని మెసేజ్ చేయాలి. తర్వాత సేవను ఎంచుకోండి మీద క్లిక్ చేసి.. అన్నదాత సుఖీభవను సెలక్ట్ చేయాలి. స్థితిని తనిఖీ చేయండి వద్ద క్లిక్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి మీద క్లిక్ చేస్తే.. రైతు పేరు, తండ్రి పేరు, జిల్లా, మండలం, గ్రామం వివరాలు వస్తాయి. అందులోనే అన్నదాత సుఖీభవకు అర్హులా?, అనర్హులా? అనేది వస్తుంది. అనర్హులైతే అందుకు కారణం కూడా ఉంటుంది.
News November 18, 2025
ఖమ్మం నుంచే కవిత వ్యూహం?.. రాజకీయాల్లో ఉత్కంఠ

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు MLC కల్వకుంట్ల కవిత ఖమ్మం జిల్లా రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వైరా మాజీ MLA, దివంగత బాణోత్ మదన్ లాల్ నివాసంలో ఆమె బస చేయనుండటం ఈ చర్చకు తెర తీసింది. ఇటీవల మరణించిన మదన్ లాల్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆయన సతీమణి మంజుల వైరాలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. త్వరలో ఆమె జాగృతిలో చేరి, వైరా నుంచి పోటీ చేస్తారనే చర్చ ఖమ్మం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.


