News February 19, 2025

రేపు కాగజ్ నగర్‌కు మంత్రి సీతక్క

image

రేపు ఉదయం 11 గంటలకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాగజ్‌నగర్‌లో పర్యటిస్తారని ఎమ్మెల్సీ దండే విఠల్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని, ఈ సమావేశానికి పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని అన్నారు.

Similar News

News October 15, 2025

20 మంది మృతి.. పరిహారం ప్రకటించిన ప్రధాని

image

రాజస్థాన్‌లో జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్‌కు వెళ్తున్న బస్సు <<18008110>>దగ్ధమై<<>> 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై PM మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

News October 15, 2025

సూర్యాపేట: రాయితీ సొమ్ము కోసం ఎదురుచూపులు..!

image

సూర్యాపేట జిల్లాలో లబ్ధిదారులకు అకౌంట్లలో రాయితీ జమ కావడం లేదు. ఐదారు నెలలుగా రాయి సొమ్ము రావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 4 లక్షలకు పైనే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మహాలక్ష్మీ పథకం కోసం దాదాపు 3 లక్షలకు పైనే దరఖాస్తులు అందాయి. రాయితీ డబ్బులు పడితే తమకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని, ప్రభుత్వం స్పందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

News October 15, 2025

బీమా పొందాలంటే ఈ- పంట, ఈ- కేవైసీ తప్పనిసరి: కలెక్టర్

image

తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు బీమా, పరిహారం పొందాలంటే ఈ- పంట, ఈ- కేవైసీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పష్టం చేశారు. కలెక్టర్ మంగళవారం మాట్లాడారు. గ్రామ స్థాయిలోని వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించి ఈ పంట ఈ కేవైసీ‌పై అవగాహన కల్పించి పూర్తి చేయాలన్నారు. అటు 1.85 లక్షల ఎకరాలలో వరి సాగు ఉందని పేర్కొన్నారు.