News September 30, 2024
రేపు కామారెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

కామారెడ్డి: స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ మంగళవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి జిల్లా కేంద్రానికి రానున్నట్లు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చెప్పారు. స్థానిక కొత్త బస్టాండ్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొంటారని, అనంతరం పట్టణంలోని తిలక్ రోడ్డులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నా తర్వత రాజారెడ్డి గార్డెన్లో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారన్నారు.
Similar News
News December 7, 2025
NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.
News December 7, 2025
NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.
News December 7, 2025
NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.


