News March 18, 2025
రేపు కృష్ణా జిల్లాకు రానున్న మంత్రి నారా లోకేశ్

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆగిపోయిన అశోక్ లేలాండ్ ప్లాంట్కు కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా 45,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పలువురు అధికారులుు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా నిరీక్షణలో ఉన్న స్థానికులకు ఇది వరంలాంటిదన్నారు. ఈ ప్లాంట్ ప్రారంభంతో మల్లవల్లి పారిశ్రామిక హబ్గా ముందడుగు వేయనున్నట్లు తెలిపారు.
Similar News
News October 14, 2025
ఇందిరాగాంధీ స్టేడియంలో కబడ్డీ, వాలీబాల్ జట్ల ఎంపిక

కృష్ణాజిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అండర్-19 కబడ్డీ, వాలీబాల్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలి. ఈ ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 14, 2025
విజయవాడలో అండర్-19 బాడ్మింటన్ జట్ల ఎంపిక

కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 16న విజయవాడలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలోని బాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ వెంట పుట్టిన తేదీతో కూడిన స్టడీ సర్టిఫికెట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం, సీల్తో కూడిన ఎంట్రీ ఫారం తీసుకొనిరావాలన్నారు. ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని SGF అండర్-19 కార్యదర్శి రవికాంత తెలిపారు.
News October 14, 2025
కృష్ణానది నుంచి నేరుగా రక్షిత తాగునీరు: ఎంపీ

జల్జీవన్ పథకం కింద కృష్ణానది నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటింటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేయాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బాలాజీతో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.