News August 18, 2024

రేపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా పర్యటన

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో 11వ జూనియర్ అంతర జిల్లాల సాఫ్ట్-బాల్‌ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు కోటబొమ్మాళి మండలం తాటిపర్తి గ్రామంలో మెండ భాస్కరరావు వర్ధంతి సభలో పాల్గొంటారు.

Similar News

News November 8, 2025

SKLM: ‘క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

క్యాన్సర్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ అనిత అన్నారు. శ్రీకాకుళం డీ ఎం‌అండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వ్యాధి నివారణ కోసం శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో మొదటి స్థానంలో జబ్బు గుండె వ్యాధి ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ వ్యాధి ఉందని ఆమె పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారన్నారు.

News November 7, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

★బాలియాత్ర ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన
★జలుమూరు: జాబ్ మేళాలో 203 మంది ఎంపిక
★కాశీబుగ్గలో NCC విద్యార్థుల ర్యాలీ
★నిరుపేదలను ఆదుకోవడమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే శంకర్
★పలాసలో కిడ్నాప్.. బాధితుడు ఏమన్నాడంటే ?
★ఎచ్చెర్ల: ఇష్టారీతిన మట్టి తరలింపు
★రణస్థలం: రహదారి లేక నరకం చూస్తున్నాం
★శ్రీకాకుళం: ప్రిన్సిపల్ వేధింపులతో చనిపోవాలనుకున్నా
★సోంపేట: అధ్వానంగా రోడ్లు..వాహనదారులకు తప్పని అవస్థలు

News November 7, 2025

SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

image

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.