News March 28, 2025
రేపు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు శనివారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4:40 నిమిషాలకు కొడంగల్ పట్టణంలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొననున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.
Similar News
News November 8, 2025
₹5,942 కోట్లతో సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టు: లోకేశ్

TGకి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ₹5,942 కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. దీనికోసం 2005లో నాయుడుపేట ఇండస్ట్రీయల్ పార్కులో 269 ఎకరాలు కేటాయించామన్నారు. 5GW సిలికాన్ ఇంగోట్, 4GW టాప్కాన్ సోలార్ సెల్ యూనిట్లు నెలకొల్పుతారని చెప్పారు. వీటిని 7GWకి విస్తరిస్తారన్నారు. దీనిద్వారా 3500మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
News November 8, 2025
Tragedy: ఉప్పల్లో కానిస్టేబుల్ సూసైడ్

ఉప్పల్లో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మల్లికార్జుననగర్లో నివాసం ఉంటోన్న శ్రీకాంత్(42) 2009 బ్యాచ్కు చెందిన PC. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అక్టోబర్ 23 నుంచి విధులకు కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆర్థిక సమస్యలే సూసైడ్కు కారణమని సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.


