News February 25, 2025
రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News January 7, 2026
అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా ‘ధురంధర్’

రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన 33 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1,222 కోట్ల వసూళ్లను సాధించింది. అటు ఇండియాలో రూ.831.40కోట్ల వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డులకెక్కింది. USలో $20M క్రాస్ చేసి బాహుబలి-2 తర్వాత ఆ ఘనత సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. త్వరలో ‘RRR’ వసూళ్లనూ బీట్ చేయనుంది.
News January 7, 2026
అడ్డతీగల: ‘టీచర్స్ వివరాలు అప్ లోడ్ చేయండి’

పోలవరం జిల్లాలో ప్రభుత్వం విద్యాలయాల్లో పని చేస్తున్న టీచర్స్ అందరూ తమ వ్యక్తి గత వివరాలను లీప్ యాప్ లో నమోదు చేయాలని ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు బుధవారం మీడియాకు తెలిపారు. విద్య శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఈ నెల 9లోగా అప్ లోడ్ చేయాలని, మార్పులు, చేర్పులు ఉంటే రెండు రోజుల్లో సరిచేసుకోవాలన్నారు. ఇక గడువు పొడుగుంచబడని, అందరు టీచర్స్ ఆదేశాలు పాటించాలన్నారు.
News January 7, 2026
ఉగ్ర దోస్తీ.. పాక్లో చేతులు కలిపిన హమాస్, లష్కరే!

పాక్ అడ్డాగా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ ముమ్మరమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా హమాస్ కమాండర్ నాజీ జహీర్, లష్కరే తోయిబా కీలక నేత రషీద్ అలీ సంధూతో గుజ్రాన్వాలాలో కలవడం సంచలనం సృష్టిస్తోంది. గతంలోనూ జహీర్ PoKలో పర్యటించి భారత వ్యతిరేక ర్యాలీల్లో పాల్గొన్నాడు. అమెరికా నిషేధించిన ఈ రెండు గ్రూపుల మధ్య సమన్వయం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పాక్ సైన్యం అండ ఉన్నట్లు సమాచారం.


