News February 25, 2025
రేపు కొమురవెల్లి మల్లన్న ‘పెద్ద పట్నం’

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News October 29, 2025
రేపు యథావిధిగా పాఠశాలలు: నంద్యాల డీఈవో

నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు రేపటి నుంచి యథావిధిగా పనిచేయాలని డీఈవో జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. పాఠశాల నిర్వహణకు ఇబ్బందులు ఉంటే గురువారం సెలవు ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
News October 29, 2025
తొర్రూరు-నర్సంపేట రాకపోకలు బంద్

తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తొర్రూరు- నర్సంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అమ్మపురం- బొత్తలతండా సమీపంలోని కల్వర్టులో నీటి ప్రవాహం పెరిగి ప్రమాద స్థాయికి చేరుకుంది. అప్రమత్తమైన పోలీసులు రహదారికి రెండు వైపులా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. గుర్తూరు ఈదులవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను మళ్లిస్తున్నారు.
News October 29, 2025
రేపటి నుంచి జిల్లాలో స్కూల్స్ యథాతధం: డీఈవో

మొంథా తుఫాను తీరం దాటిన నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనడంతో రేపటి నుంచి స్కూల్స్ యథాతధంగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఈ.నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం వాతావరణం నెమ్మదించడంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి యథాతధంగా పనిచేస్తాయని చెప్పారు.


