News February 2, 2025
రేపు గ్రివెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పీజీఆర్ఎస్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు ఉదయం 9:30 గంటలకే పీజీఆర్ఎస్కు హాజరు కావాలని ఆదేశించారు.
Similar News
News November 17, 2025
GNT: యోగా పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై, ఆగస్టు నెలలో యోగ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. పీజీ డిప్లొమా ఇన్ యోగా సెకండ్ సెమిస్టర్, ఎమ్మెస్సీ యోగా ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 26వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.
News November 17, 2025
GNT: యోగా పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై, ఆగస్టు నెలలో యోగ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శనివారం విడుదల చేశారు. పీజీ డిప్లొమా ఇన్ యోగా సెకండ్ సెమిస్టర్, ఎమ్మెస్సీ యోగా ఫోర్త్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 26వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ. 1,860 చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీలోని సంబంధించిన అధికారులను సంప్రదించాలన్నారు.
News November 17, 2025
వనపర్తి: ధాన్యం ఆన్లైన్ ఎంట్రీలో ఆలస్యం.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 291 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఇందులో 10,682 MT ధాన్యాన్ని మిల్లులకు తరలించినా, 6 వేల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఆన్లైన్ ఎంట్రీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 876 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి మాత్రమే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు.


