News February 2, 2025
రేపు గ్రివెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజకుమారి గనియా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను పీజీఆర్ఎస్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా శాఖల జిల్లా అధికారులు ఉదయం 9:30 గంటలకే పీజీఆర్ఎస్కు హాజరు కావాలని ఆదేశించారు.
Similar News
News February 8, 2025
SKLM: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికి?

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
News February 8, 2025
అనూహ్యం.. ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం

ఢిల్లీలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత ఆప్ ఆధిక్యం కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయా స్థానాల్లో బీజేపీ దూసుకొచ్చింది. మొత్తం 12 స్థానాల్లో ప్రస్తుతం 7 చోట్ల బీజేపీ లీడింగ్లో ఉంది. దీంతో ఆప్, కాంగ్రెస్ని కూడా ముస్లింలు ఆదరించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
News February 8, 2025
HYD: జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు

ముందస్తు జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్లో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ చర్యల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సత్వర స్పందన ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చని, అధికారులు సిబ్బంది విపత్తు నిర్వహణ విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు.