News March 15, 2025
రేపు జనగామ జిల్లాకు సీఎం రాక

జనగామ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లిలో సభకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
పశుసంపద బలోపేతమే లక్ష్యం: కలెక్టర్

పశు సంపద రంగాన్ని బలోపేతం చేయటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ కృత్తికా శుక్ల అన్నారు. గొర్రెల పెంపకందారులను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొస్తున్న క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ షీప్ హోస్టెల్స్ (CRISH) ప్రాజెక్టు అమలుపై కలెక్టరేట్లో ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 9, 2025
VZM: ‘వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి’

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్ బాబు మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. గొల్లలపేట (PMAY-1.0)లో నిర్మిస్తున్న 106 ఇళ్లను సందర్శించి, లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ ఇళ్లను ఉగాది 2026 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
News December 9, 2025
అనకాపల్లి: ‘పది, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి’

జిల్లాలో ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి కలెక్టరేట్ నుంచి మంగళవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 100 రోజుల కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇంటికి వెళ్లిన వసతి గృహాలకు చెందిన విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకురావాలన్నారు.


