News August 30, 2024

రేపు జిల్లాలో పింఛన్ల పంపిణీ: కడప కలెక్టర్

image

కడప జిల్లా వ్యాప్తంగా రేపు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. 1వ తేదీన ఆదివారం అవడంతో ముందు రోజునే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. వంద శాతం పింఛన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు

Similar News

News February 13, 2025

పులివెందుల: గడ్డి మందు తాగి బాలుడు మృతి

image

పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లెకు చెందిన వెంగముని, దేవిల కుమారుడు మోహిత్(14) మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగాడు. బంధువులు మోహిత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆసుపత్రికి రెఫర్ చేశారు. బుధవారం చికిత్స పొందుతూ మోహిత్ మృతి చెందాడని బంధువులు తెలిపారు. కాగా ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదనే బాలుడు విషం తాగాడని సమాచారం.

News February 13, 2025

కడప: హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన

image

బైక్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ ధారణపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సమయంలో ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు.

News February 12, 2025

14న కడపకు మాజీ సీఎం జగన్ రాక

image

ఈనెల 14న కడప నగరానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రానున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహానికి జగన్ హాజరవుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి కడపకు చేరుకొని వివాహ వేడుకల్లో పాల్గొని అనంతరం జగన్ నేరుగా బెంగళూరుకు వెళ్తారని పార్టీ నాయకులు వెల్లడించారు.

error: Content is protected !!