News August 12, 2024

రేపు తుంగభద్ర డ్యామ్‌కు కర్ణాటక సీఎం

image

కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తుంగభద్ర డ్యామ్‌ను రేపు సందర్శించనున్నారు. తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోవడంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గేటు మరమ్మతుల పనులు పరిశీలించనున్నారు. దీంతో అందుకు తగ్గ ఏర్పాట్లను కొప్పల్, విజయనగర జిల్లాల అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యామ్‌ను ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, రామానాయుడులు పరిశీలించారు.

Similar News

News May 8, 2025

ATP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సూచించారు. AP విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. AP విపత్తుల సంస్థ SMSలు, RTGS నుంచి సూచనలను తెలుపుతున్నామన్నారు. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.

News May 8, 2025

పేదలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేయూత- కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 68,379 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు అనంతపురం కలెక్టర్ డా. వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమాజంలోని సంపన్న వర్గాల ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, పైస్థాయి ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నత స్థాయిలో ఉన్న 10% వ్యక్తులను గుర్తించి వారి ద్వారా దిగువ ఉన్న 20% కుటుంబాలకు సహాయం అందించేలా చర్యలు చేపడతామన్నారు.

News May 7, 2025

సెక్షన్ ఫారమ్ 8పై చర్చ: అనంత కలెక్టర్

image

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సెక్షన్ ఫారమ్-8 కంపెనీగా నమోదు చేసే ప్రక్రియపై శనివారం చర్చ నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో JNTU వీసీ, సెంట్రల్ యూనివర్సిటీ VC, KIA ఇండియా, JSW అధికారులు పాల్గొన్నారు. సెక్షన్ ఫారమ్ 8 కంపెనీని ఏప్రిల్ 30లోపు నమోదు చేయాలన్నారు. టెండర్ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియను సమీక్షించి, అవసరమైన దశలను పరిశీలించారు.