News December 15, 2024

రేపు నంద్యాల కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ

image

ఈ నెల 16న నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9:30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలోనూ ఈ కార్యక్రమం సంబంధింత అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు.

Similar News

News January 24, 2025

నంద్యాల: కారు కొంటామని ఎత్తుకెళ్లారు

image

నంద్యాల ఆటోనగర్‌లో కారు విక్రయించడానికి వచ్చిన ఇరువురు వ్యక్తులను కారు కొంటాని నమ్మించి కారు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం తెలంగాణ నారాయణపేటకు చెందిన వెంకటేష్ రెడ్డి కారు నంద్యాలలో విక్రయించి రావాలని దళారి రాఘవేంద్ర, హనుమంతుకు అప్పగించారు. వారు NDL ఆటోనగర్‌కు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం వెంకటేష్ రెడ్డి తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

News January 24, 2025

నంద్యాల జిల్లా కలెక్టర్‌కు అవార్డు

image

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు వరించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆమెకు అవార్డును బహూకరించనున్నారు.

News January 24, 2025

కర్నూలులో 26న మాంసం విక్రయాలు బంద్

image

కర్నూలులో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం మాంసం దుకాణాలు తెరవకూడదని స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లలలో సైతం మాంసపు పదార్థాలు విక్రయించరాదన్నారు. నిబంధనలు పాటించకుంటే వ్యాపార ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.