News August 16, 2024
రేపు నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు బంద్

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులలో శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు సేవలను నిలిపివేస్తున్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించడం జరుగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్లో పీజీ డాక్టర్ను హత్యాచారం చేసిన ఘటనకు నిరసనగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 7, 2025
NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.
News December 7, 2025
NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.
News December 7, 2025
NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.


