News February 9, 2025

రేపు నిర్మల్‌లో పర్యటించనున్న త్రిపుర గవర్నర్

image

త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు నిర్మల్ చేరుకొని అక్కడి నుంచి మంజులాపూర్‌లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళనున్నారు.

Similar News

News October 3, 2025

MDK: ఎన్నికలు.. ఖర్చు పెట్టే వారికే టికెట్లు?

image

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికపై ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న విడుదల చేయనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా ఖర్చు పెట్టుకుంటామని ముందుకు వచ్చే వారికే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. దీనిపై మీ కామెంట్.

News October 3, 2025

కరీంనగర్: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

కరీంనగర్ నగరంలోని విద్యానగర్‌లో దాసరి కృష్ణ కుమార్ గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చేర్ల బూత్కూర్ గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ కొంతకాలంగా KNRలో ఉంటున్నాడని, ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News October 3, 2025

శక్తిమంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి: సజ్జనార్

image

సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. కంటెంట్ హాస్యం కోసం కాకుండా శక్తిమంతంగా ఉండాలని Xలో పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను మహిళా రక్షణ, డ్రగ్స్ వ్యతిరేక, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించే రీల్స్, పోస్టులకు వేదికగా మార్చాలని పేర్కొన్నారు. లైక్స్ కాదు, జీవితాలను(లైవ్స్) కాపాడటమే ముఖ్యమన్నారు. మీరు ఇవాళ చేసే వీడియో రేపు ఒక జీవితాన్ని నిలబెడుతుందని సూచించారు.