News February 9, 2025
రేపు నిర్మల్లో పర్యటించనున్న త్రిపుర గవర్నర్

త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు నిర్మల్ చేరుకొని అక్కడి నుంచి మంజులాపూర్లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళనున్నారు.
Similar News
News November 13, 2025
HYD: హోమియో ఆసుపత్రిలో ఆర్థరైటిస్, సోరియాసిస్కు వైద్యం!

రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో హోమియో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. 1, 3, 4, 5 గదులలో ఆర్థరైటిస్, సోరియాసిస్, ఫంగస్ ఇన్ఫెక్షన్, స్పాండిలైటిస్ లాంటి సమస్యలకు పరిష్కారం చూపుతారు. అంతేకాక అల్సర్కు సైతం వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
SHARE IT
News November 13, 2025
విశాఖలో ట్రాఫిక్ డైవర్షన్

విశాఖలో ఈనెల 14, 15వ తేదీల్లో జరగనున్న సీఐఐ సమ్మిట్-2025 నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్లు అమలు చేస్తున్నారు.
➣సిరిపురం, టైకూన్, మాస్క్ జంక్షన్ల వద్ద సాధారణ వాహనాల రూట్లు మార్చారు
➣ విజయనగరం నుంచి వెళ్లే వాహనాలు ఆనందపురం వయా పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి
➣అనకాపల్లి నుంచి విజయనగరం వచ్చే వాహనాలు లంకెలపాలెం జంక్షన్ వయా సబ్బవరం, పెందుర్తి మీదుగా అనకాపల్లికి చేరుకోవాలి
News November 13, 2025
HYD: హోమియో ఆసుపత్రిలో ఆర్థరైటిస్, సోరియాసిస్కు వైద్యం!

రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో హోమియో వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. 1, 3, 4, 5 గదులలో ఆర్థరైటిస్, సోరియాసిస్, ఫంగస్ ఇన్ఫెక్షన్, స్పాండిలైటిస్ లాంటి సమస్యలకు పరిష్కారం చూపుతారు. అంతేకాక అల్సర్కు సైతం వైద్యం అందిస్తున్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.
SHARE IT


