News February 9, 2025

రేపు నిర్మల్‌లో పర్యటించనున్న త్రిపుర గవర్నర్

image

త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు నిర్మల్ చేరుకొని అక్కడి నుంచి మంజులాపూర్‌లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళనున్నారు.

Similar News

News November 10, 2025

NHSRCలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌(NHSRC)లో 4 పోస్టులకు దరఖాస్తులు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, బీకామ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బీహెచ్ఎంస్, బీఏఎంస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nhsrcindia.org/

News November 10, 2025

హనుమాన్ చాలీసా భావం – 5

image

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
హనుమంతుని ఒక చేతిలో ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టేంత శక్తి కలిగిన వజ్రాయుధం(గద), మరో చేతిలో విజయానికి ప్రతీకైన పతాకం ప్రకాశిస్తుంటాయి. ఆయన భుజంపై ఉండే జంధ్యం ఆయన అపారమైన శక్తి, విజయం మరియు, సూచిస్తుంది. మనం కూడా హనుమంతునిలా ధైర్యాన్ని, సత్యాన్ని ఆశ్రయిస్తే జీవితంలో తప్పక విజయం సాధిస్తాం. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 10, 2025

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు

image

ప్రముఖ కవి, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డా.అందెశ్రీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అందెశ్రీ మరణం పట్ల మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటతో పాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి శ్రద్ధాంజలి అని ట్వీట్ చేశారు. పలువురు ఏపీ మంత్రులు అందెశ్రీకి నివాళి అర్పించారు.