News January 31, 2025

రేపు పరిగి నియోజకవర్గానికి KTR రాక

image

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాస్య నాయక్ తండాలో జరిగే అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణలో కేటీఆర్ పాల్గొంటారని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. ఉదయం కార్యక్రమం ఉంటుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News December 2, 2025

590 లీటర్ల అక్రమ మద్యం సీజ్‌: సూర్యాపేట ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఎస్పీ నరసింహ ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 50 కేసుల్లో రూ.4.50 లక్షల విలువైన 590 లీటర్ల అక్రమ మద్యం సీజ్‌ చేసి, 291 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News December 2, 2025

KMR: మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన డీఎం

image

తాడ్వాయి మండలం దేమి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి నేడు పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో ఆయన ముఖాముఖి మాట్లాడి, వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి మక్కల కొనుగోలు ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

News December 2, 2025

నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని: రవిశాస్త్రి

image

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 0-2తో భారత్ కోల్పోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ విషయంలో గంభీర్‌ను ప్రొటెక్ట్ చేయనని అన్నారు. ‘అతడు 100% బాధ్యత వహించాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఓటమికి మొదటి బాధ్యతను తీసుకునే వాడిని. నిజానికి టీమ్ కూడా అంత ఘోరంగా లేదు. కానీ గువాహటిలో 100-1 నుంచి 130-7కి పడిపోయారు. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.