News January 31, 2025
రేపు పరిగి నియోజకవర్గానికి KTR రాక

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాస్య నాయక్ తండాలో జరిగే అంబేడ్కర్ విగ్రహా ఆవిష్కరణలో కేటీఆర్ పాల్గొంటారని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డి తెలిపారు. ఉదయం కార్యక్రమం ఉంటుందని అన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 22, 2025
పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.
News November 22, 2025
పెళ్లి చేసుకుంటున్నారా? శ్రీవారి కానుక అందుకోండిలా..

పెళ్లి చేసుకునేవారికి TTD ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. నూతన దంపతులకు వేంకటేశ్వరస్వామి ఆశీర్వచనంతో కూడిన మహా ప్రసాదం, కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలను ఉచితంగా పంపిస్తుంది. అందుకోసం వివాహ తొలి శుభలేఖను కార్యనిర్వహణాధికారి, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, తిరుపతి చిరునామాకు పంపితే చాలు. వివాహానికి ఓ నెల ముందు పత్రిక పంపితే, స్వామివారి ప్రసాదం వివాహ సమయానికి అందుతుంది.
News November 22, 2025
ఆవూ దూడా ఉండగా మధ్య గుంజ ఆర్చిందట

కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులు తమలో తాము గొడవపడుతున్నప్పుడు, ఆ పోట్లాటలో మధ్యలో జోక్యం చేసుకున్న వ్యక్తి నష్టపోతాడు అనే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. ఆవును, దూడను కట్టేసినప్పుడు వాటి మధ్య ‘గుంజ’ ఆధారంగా ఉంటుంది. ఆవు, దూడ అటూఇటూ లాక్కోవడం వల్ల వాటి బలం తట్టుకోలేక మధ్యలో ఉన్న ‘గుంజ’ విరిగిపోయినట్లుగా, ఇద్దరు వ్యక్తుల గొడవలో మూడో వ్యక్తి బలి అవుతాడని ఈ సామెత భావం.


