News September 29, 2024
రేపు ప్రజావేదికలో ఫిర్యాదులు స్వీకరించనున్న మంత్రి అనిత

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. రేపు ప్రజావేదికలో మంత్రి అనిత వంగలపూడి, టీడీపీ సీనియర్ నేత BT నాయుడు పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారని పల్లా శ్రీనివాస్ తన అధికారిక ట్విటర్(X) ఖాతాలో పోస్ట్ చేశారు.
Similar News
News October 24, 2025
కృష్ణా జిల్లాలో వర్షపాతం వివరాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 46.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా గూడూరు మండలంలో 89.2 మి.మీల వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా నాగాయలంక మండలంలో 19.6మి.మీల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News October 24, 2025
కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.
News October 24, 2025
డిజిటల్ ట్రేసబులిటీతో రైతులకు లాభాలు: కలెక్టర్

నూతన వ్యవసాయ విధానం వలన పెట్టుబడి వ్యయం, విద్యుత్ ఛార్జీల వ్యయం గణనీయంగా తగ్గుతుందని
కలెక్టర్ బాలాజీ అన్నారు. సకాలంలో పంట కోతను చాలా జాగ్రత్తగా పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. అలాగే, డిజిటల్ ట్రేసబులిటీ ద్వారా రైతులు తమ పంట వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చని, దీనివల్ల బ్యాంకులు రుణాలు మంజూరు చేయడమే కాక భీమా కంపెనీలు కూడా భీమా సదుపాయాలు అందిస్తున్నాయని కలెక్టర్ వివరించారు.


