News February 2, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై వినతులు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
Similar News
News November 13, 2025
HYD: నేడే ఫీజు చెల్లింపులకు లాస్ట్..!

HYD డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019- 2024 మధ్య చేరిన డిగ్రీ 1st, 3rd ఇయర్ విద్యార్థులు ఇంకా ట్యూషన్ ఫీజు చెల్లించని వారు NOV 13లోపు చెల్లించొచ్చని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 2022- 2024 మధ్య MA, MCom, MSc అడ్మిషన్ పొందిన వారూ 2nd ఇయర్ ట్యూషన్ ఫీజు చెల్లించొచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.braouonline.inను సందర్శించండి.
News November 13, 2025
సిద్దిపేట: లక్షల్లో జీతాలు.. లంచాలే నేస్తాలు!

లక్షల్లో జీతాలు వస్తున్న అధికారుల తీరు మాత్రం మారడం లేదు. జిల్లాకు చెందిన కొందరూ అధికారులు లంచాలకు అలవాటు పడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆగస్టులో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న మేస్త్రి నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో సిద్దిపేట హౌసింగ్ ఏఈ సస్పెండ్ అయ్యారు. నిన్న ములుగులో రూ.50 వేలు తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్ పట్టుబడ్డారు. అవినీతి పరులేవరైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
News November 13, 2025
‘పల్నాటి వీరుల తిరునాళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు’

పల్నాటి వీరుల తిరునాళ్ల మహోత్సవానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కారంపూడి తహశీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన నిర్వాహకులతో కలిసి వీరుల గుడి ప్రాంగణాన్ని పరిశీలించారు. నాగులేరు వాగును శుభ్రం చేసే పనులు చేపడతామని, ఐదు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.


