News February 2, 2025

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగే కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై వినతులు ఇవ్వవచ్చునన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News December 16, 2025

MP బైరెడ్డి శబరి ఇంట్లో మంత్రి లోకేశ్

image

న్యూఢిల్లీలో మంత్రి నారా లోకేశ్ టీడీపీ పార్లమెంట్ సభ్యులతో నంద్యాల MP డాక్టర్ బైరెడ్డి శబరి ఇంట్లో లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఎంపీ శబరి ఆహ్వానం మేరకు ఢిల్లీలోని ఆమె ఇంటికి నారా లోకేశ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు TDP ఎంపీలు హాజరయ్యారు. మంత్రి లోకేశ్‌కు, తనతోటి ఎంపీలకు భోజనాల ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని శబరి తెలిపారు.

News December 16, 2025

ధనుర్మాసంలో శ్రీవ్రతం ఆచరిస్తే..?

image

నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ పుణ్య కాలంలో శ్రీవ్రతం ఆచరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. విష్ణువును మధుసూధనుడిగా పూజించి గోదాదేవి కీర్తనలు ఆలపిస్తారు. ఫలితంగా మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు కృష్ణుడికి తులసి మాల సమర్పిస్తే నచ్చిన వరుడితో వివాహం జరుగుతుందని సూచిస్తున్నారు. ☞ శ్రీవ్రతం ఎలా చేయాలి? గోదాదేవి కీర్తనల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 16, 2025

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించడం

image

పొగపెట్టి ఎలుకలను నిర్మూలించే విధానాన్ని పంట ఏ దశలోనైనా అనుసరించవచ్చు. బర్రో ఫ్యూమిగేటర్‌ ద్వారా ఎలుకలు ఉండే కన్నాలలో పొగను వదిలి సులువుగా చంపవచ్చు. అయితే పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్లను మట్టితో మూసివేయాలి. పొగను కనీసం మూడు నిమిషాలు వదలాలి. ఇలా చేస్తే ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించవచ్చు. తదుపరి సీజన్‌లో వాటి ఉద్ధృతిని తగ్గించవచ్చు.