News April 13, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ఈనెల 14 సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావడంతో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
ప్రతిరోజు ఈ హనుమాన్ మంత్రం పఠిస్తే..

‘ఓం పవన సుత హనుమాన్ కీ జై’ అనే మంత్రాన్ని నిత్యం జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా అనూహ్యమైన శక్తి సొంతమవుతుందని అంటున్నారు. ఈ శక్తిమంతమైన మంత్రాన్ని రోజూ 108 సార్లు ఉచ్చరించడం వలన మనోబలం, ధైర్యం పెరుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ జపం వలన తక్షణ ఫలితాలు రావడంతో పాటు, సమస్త భయాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హనుమంతుని కృపతో అడ్డంకులన్నీ తొలగిపోవాలని ఆశిద్దాం.
News November 4, 2025
నేటి నుంచి పరీక్షల బహిష్కరణ: ప్రైవేట్ కాలేజీలు

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం నిన్నటి నుంచి ప్రైవేట్ కాలేజీలు <<18182444>>బంద్<<>> చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి జరిగే పరీక్షలన్నీ బహిష్కరిస్తున్నట్లు యాజమాన్య సంఘం తెలిపింది. మొత్తం బకాయిల్లో రూ.5 వేల కోట్లు చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని FATHI ఛైర్మన్ రమేశ్ తెలిపారు. ఈ ఏడాది విద్యారంగానికి కేటాయించిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News November 4, 2025
అన్నీ పండించే కాపునకు అన్నమే కరవు

రైతులు తమ శ్రమతో దేశం మొత్తానికి కావాల్సిన పంటలు పండించి ఆహారాన్ని అందిస్తారు. కానీ కొన్నిసార్లు వారి సొంత కష్టాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతుకే సరైన తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరుల ఆకలి తీర్చే అన్నదాతలు తమ ప్రాథమిక అవసరాలకే కష్టపడటాన్ని ఈ సామెత తెలియజేస్తుంది. రైతు కష్టానికి తగిన గుర్తింపు, మద్దతు లభించడం లేదనే విషయాన్ని ఇది సూచిస్తుంది.


