News April 1, 2025

రేపు ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన

image

ఒంగోలు కలెక్టరేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ ఎర్రయ్య మంగళవారం తెలిపారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే 30% ఐఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సీపీఎస్, జీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

Similar News

News September 17, 2025

ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

image

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.

News September 17, 2025

ఒంగోలులో పిడుగుపాటు.. పదేళ్ల బాలుడి మృతి.!

image

ఒంగోలులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు శివారు ప్రాంతంలో పదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లు సమాచారం. దీంతో బాలుడు మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడు కంకణాల చందుగా తెలుస్తోంది.

News September 17, 2025

S.కొండ: ఫోక్సో కేసుపై DEO కార్యాలయంలో చర్చ

image

ఒంగోలు DEO కార్యాలయంలో సింగరాయకొండలో జరిగిన ఫోక్సో కేసు అంశంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వరు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసులను 164 స్టేట్మెంట్ ఆధారంగా తప్పుడు రీతిలో రిఫర్ చేస్తున్న పరిస్థితిపై చర్చ సాగింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారు.